Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్ డేట్స్!

  • 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,502
  • కోలుకున్న వారు 2,80,565 మంది  
  • మృతుల సంఖ్య 1,549
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 574 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,502కి  చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,80,565 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,549కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 5,388 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,210 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 81  కరోనా కేసులు నమోదయ్యాయి.

          

More Telugu News