Budda Venkanna: ఈ రోజు, రేపు వీసా రెడ్డి బిజీగా ఉంటాడట.. ఏంటా అని ఆరా తీస్తే ఈ విషయం తెలిసింది: బుద్ధా వెంకన్న సెటైర్

  • తనను ఎవరూ కలవద్దు అని చెప్పారంట
  • ప్రభుత్వం ఇచ్చిన కుక్కలు, పందుల లైసెన్స్ నిర్ణయం కోసం పనులు 
  • తాడేపల్లి ప్యాలెస్ లో కట్టేసిన కుక్కలు, పందులకు లైసెన్స్ తీసుకునే పని
budda venkanna slams vijay sai

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇకపై కుక్కలను, పందులను పెంచుకోవాలంటే గ్రామ పంచాయతీల్లో లైసెన్సు తీసుకోవాల్సిందేనంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రామాల్లో వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుద్ధా వెంకన్న ప్రస్తావించారు.

‘ఈ రోజు, రేపు, వీసా రెడ్డి బిజీగా ఉంటాడని, ఎవరూ కలవద్దు అని చెప్పారంట. ఏంటా అని ఆరా తీస్తే, తుగ్లక్ ప్రభుత్వం ఇచ్చిన కుక్కలు, పందుల లైసెన్స్ నిర్ణయం కోసం, తాడేపల్లి ప్యాలెస్ లో కట్టేసిన కుక్కలు, పందులకు లైసెన్స్ తీసుకునే పనిలో వీసా రెడ్డి బిజీగా ఉన్నాడని చెబుతున్నారు’ అని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.

More Telugu News