Murder Movie: వర్మ 'మర్డర్' సినిమాపై నల్గొండ కోర్టులో విచారణ పూర్తి!

  • అమృత, ప్రణయ్ ల ప్రేమకథతో 'మర్డర్' సినిమా
  • సినిమాను ఆపేయాలంటూ అమృత పిటిషన్
  • 24వ తేదీన తీర్పును వెలువరించనున్న కోర్టు
Court adjourns judgement on RGVs Murder movie

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'మర్డర్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అమృత, ప్రణయ్ ల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఆపేయాలంటూ గత నెల 29న నల్గొండ కోర్టులో అమృత ప్రైవేట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను నల్గొండ కోర్టు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది. ఇప్పటికే ఈ కేసు విచారణ పలుమార్లు వాయిదా పడింది. గత నెల 14వ తేదీన విచారణ జరిపిన కోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు ఇరుపక్షాల వాదనను విన్న కోర్టు... తీర్పును ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో, కోర్టు ఎలాంటి తీర్పును వెలువరించనుందో అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

More Telugu News