MS Dhoni: వైరల్‌ అవుతోన్న ధోనీ పోస్ట్ చేసిన వీడ్కోలు పాట.. వీడియో ఇదిగో

  • ‘కభీ కభీ’ అనే బాలీవుడ్‌ సినిమాలో పాట పోస్ట్
  • ఉద్వేగభరితంగా సాగే ‘మై పల్‌ దో పల్‌ కా షాయర్‌’ పాట
  • ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్
dhoni farewell song video goes viral

టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆయన అభిమానులు చేస్తోన్న పోస్టులు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. తాజాగా, ధోనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పాటను పోస్ట్ చేశారు.  

‘కభీ కభీ’ అనే బాలీవుడ్‌ సినిమాలోని ‘మై పల్‌ దో పల్‌ కా షాయర్‌’ పాటను వినిపించారు. నేను రెండు నిమిషాల కవిని.. నాది ఓ చిన్న ప్రయాణం.. నాలా ఎందరో వచ్చారు, వెళ్లారు అంటూ అందులో 4 నిమిషాల పాటతో రూపొందించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

గాయకుడు ముకేశ్ పాడిన ఈ పాట అప్పట్లో బాగా ప్రజాదరణ పొందింది. ధోనీ కెరీర్‌లో తీసుకున్న ఫొటోలను కలుపుతూ రూపొందించిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ పాట మూడు కోట్ల వ్యూస్‌ సాధించించింది. ధోనీ చాలా ఉద్వేగభరితంగా ఈ వీడ్కోలు పాటను పోస్ట్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News