Vizag: విశాఖ రెల్లివీధిలో మనిషి పుర్రె కలకలం.. పాడుబడ్డ ఇంట్లో కాల్చుకుని తింటున్న సైకో రాజు

  • స్థానికులను చూసి పరారైన రావేలపూడి రాజు  
  • చెడు వ్యసనాలకు బానిసైన రాజు
  • ఒంటరిగా ఉంటూ సైకోగా మారిన వైనం
  • నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల గాలింపు
police search for psycho  raju

విశాఖ రెల్లివీధిలో మనిషి పుర్రె కలకలం రేపింది. అక్కడి ఓ ప్రాంతంలో ఓ సైకో సంచరిస్తూ భయాందోళనలు రేపాడు. ఓ పాడుబడ్డ ఇంట్లో మనిషి పుర్రెను కాల్చుకుని తింటున్న వ్యక్తిని గుర్తించిన స్థానికులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, అతడు త్రుటిలో తప్పించుకుని పారిపోయాడు.

ఆ సైకో పేరు రావేల పూడి రాజు (20) అని స్థానికులు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై, ఒంటరిగా ఉంటూ రాజు సైకోగా మారాడని తెలిసింది. ఈ ఘటనపై స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడు రాజును పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News