Madhya Pradesh: ఇద్దరు అబ్బాయిలతో అక్కాచెల్లెళ్ల ప్రేమ.. ఇంట్లో తెలిసిపోయిందని బావిలో దూకి ఆత్మహత్య

  • ఒకరి వయసు 18.. మరొకరి వయసు 16
  • వారిద్దరు ఇద్దరు యువకులతో ప్రేమాయణం
  • ఒకమ్మాయి ప్రేమికుడు ఆమె తండ్రికి మెసేజ్
  • 'మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా'నని తెలిపిన యువకుడు  
sisters commit suicide

వారిద్దరు అక్కాచెల్లెళ్లు.. ఒకరి వయసు 18.. మరొకరి వయసు 16. వారిద్దరు ఇద్దరు యువకులతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వారిలో ఒకమ్మాయి ప్రేమికుడు ఆమె తండ్రికి తాజాగా ఓ మెసేజ్‌ పంపి, తాను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీంతో తమ కూతుళ్ల ప్రేమ వ్యవహారం గురించి ఆ తండ్రికి తెలిసిపోయింది.. వారిద్దరిని పెద్దలు మందలించారు.

తాము అబ్బాయిలను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో తెలిసిపోవడంతో ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, ఓ బావి వద్దకు వెళ్లి అందులో దూకారు. మధ్యప్రదేశ్‌ సియోని జిల్లాలోని కొంద్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

బావిలో వారు దూకిన విషయాన్ని తెలుసుకున్న ఆ అక్కాచెల్లెళ్ల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను బావిలోంచి బయటకు తీశారు. అమ్మాయి తండ్రికి మేసేజ్‌ పంపిన ప్రేమికుడి‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్నామని చెప్పారు.

More Telugu News