'రాజధానిపై నాడు మీరు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పండి జగన్ గారూ' అంటూ వీడియో పోస్ట్ చేసిన దేవినేని ఉమ
- ఎన్నికల ముందు ప్రజారాజధానిగా అమరావతి ఉంటుందన్నారు
- ప్రజలను నమ్మించి మోసం చేశారు
- మాట తప్పారు.. మడమ తిప్పారు
ఎన్నికల ముందు ప్రజారాజధానిగా అమరావతి ఉంటుందని ప్రజలను నమ్మించారని దేవినేని ఉమ చెప్పారు. ఇప్పుడు వైసీపీ నేతలు మోసం చేశారని, ఏరు దాటేవరకు ఏటిమల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అంటూ మాట తప్పారని, మడమ తిప్పారని ఆయన విమర్శించారు. నాడు వైసీపీ నేతలు మాట్లాడిన మాటలకు ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం జగన్ను దేవినేని నిలదీశారు.