Wasim Akram: పాకిస్థాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ ఎందుకు అత్యుత్తమమో చెప్పిన వసీం అక్రం

  • యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అక్రమ్
  • ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం వస్తోందని వెల్లడి
  • ఆ ఆదాయాన్ని బీసీసీఐ తిరిగి భారత క్రికెట్ కే వెచ్చిస్తోందని వివరణ
Wasim Akram rated IPL greater and better than PSL

సాధ్యమైనంత వరకు భారత్ కు మద్దతుగా మాట్లాడే పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహించే పీఎస్ఎల్ (పాకిస్థాన్ సూపర్ లీగ్) కంటే ఐపీఎల్ టోర్నీయే అత్యుత్తమం అని పేర్కొన్నారు.

ఐపీఎల్ ఓ భారీ టోర్నీ అని, దానికోసం బీసీసీఐ ఎంతో ఖర్చు చేస్తోందని తెలిపారు. ఖర్చుకు తగిన స్థాయిలో ఐపీఎల్ కు విపరీతమైన ఆదాయం లభిస్తోందని, ఆ విధంగా వచ్చిన డబ్బును బీసీసీఐ తిరిగి క్రికెట్ కోసమే ఖర్చు చేస్తోందని, భారత్ లో దేశవాళీ క్రికెట్ కోసం వెచ్చిస్తున్నారని వివరించారు. ఈ కారణంగానే భారత దేశవాళీ క్రికెట్ నుంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారని అక్రమ్ అభిప్రాయపడ్డారు. కానీ పాకిస్థాన్ లో పీఎస్ఎల్ లో ఓ ఫ్రాంచైజీ కోసం ఖర్చు చేసే సొమ్ము ఎంతో తక్కువ అని వెల్లడించారు. ఆటగాళ్లను కొనుక్కునేందుకు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీకి రూ.80 కోట్ల బడ్జెట్ ఉంటుందని, పీఎస్ఎల్ ఫ్రాంచైజీల బడ్జెట్ ఆ దరిదాపుల్లో కూడా ఉండదని అక్రమ్ తెలిపారు.

More Telugu News