China: మరో 280 చైనా యాప్‌లపై నిషేధం విధించనున్న భారత్‌.. పబ్‌జీపై కూడా!

  • ఇప్పటికే టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లపై బ్యాన్
  • చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లపై బ్యాన్ పరిశీలన
  • దీనిపై పనులు ప్రారంభించిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ
  • డేటా మార్పిడిపై సమాచారం సేకరణ
more china apps ban in india

దేశంలో అత్యధికంగా వినియోగిస్తోన్న టిక్‌టాక్‌ సహా 59 చైనా మొబైల్‌ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. సరిహద్దుల వద్ద దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా తీరుకి ప్రతిగా ఆ దేశానికి చెందిన ఈ యాప్‌లపై భారత్ నిషేధం విధించింది. ఇప్పుడు మరిన్ని యాప్‌లను బ్యాన్ చేసే అంశంపై యోచిస్తోంది.

గూగుల్‌ ప్లే స్టోర్‌లో చైనాకు చెందిన లక్షలాది యాప్‌లు ఉన్నాయి. భారత్‌లో ప్రజాదరణ పొందిన మరో 280 చైనా యాప్‌లపై కూడా నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. చైనాలో సర్వర్లు ఉన్న యాప్‌లను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గుర్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన పబ్‌జీని కూడా బ్యాన్ చేయాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది.

280 యాప్‌లపై ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ నిఘా పెట్టినట్లు తెలిసింది. ఆ యాప్‌ల ద్వారా సమాచారం ఎలా మారుతుందన్న అంశంపై వివరాలు సేకరిస్తోంది. 20 యాప్‌ల ద్వారా జరుగుతున్న డేటా మార్పిడిపై నిపుణులు సమాచారం సేకరించినట్లు తెలిసింది.

చైనాలో సర్వర్లు ఉన్న అన్ని యాప్‌లను బ్యాన్ వేసే యోచనలో ఉంది. కాగా, ఇప్పటికే 59 చైనా యాప్‌లను నిషేధించడంపై చైనా స్పందిస్తూ.. భారత చర్య తమని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. చైనాను దారిలోకి తీసుకురావాలంటే ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని భారత్ భావిస్తోంది.

More Telugu News