Rajasthan: పెళ్లి తరువాత అత్తారింటికి వెళుతూ... మధ్యలో నదిలో దూకేసిన నవ వధువు!

  • రాజస్థాన్ లో ఆదివారం వివాహం
  • ఆ వెంటనే మధ్యప్రదేశ్ కు బయలుదేరిన పెళ్లివారు
  • చంబల్ నదిలో దూకేసిన నవ వధువు
Bride Sucide Next Day of Marriage

కొన్ని గంటల క్రితం వివాహం చేసుకున్న ఓ యువతి, అత్తారింటికి వెళుతున్న మార్గంలో వాంతి వస్తోందని కారును ఆపించి, నదిలో దూకేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో జరిగింది. ఆమె ఇలా ఎందుకు చేసిందో తెలియకపోవడం మిస్టరీ. పోలీసులు, యువతి బంధువులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, ఆదివారం నాడు రాజస్థాన్ కు చెందిన అలాపుర్ యువతికి వివాహమైంది.

అమ్మాయిని అత్తారింటికి పంపే వేడుక కూడా ఘనంగా జరిగింది. తన భర్త, అత్తమామలతో కలిసి మధ్యప్రదేశ్ కు ఆమె బయలుదేరింది. షియోపూర్ చంబల్ నదిపై వాహనం వెళుతున్న వేళ, ఆమె తనకు వాంతి వస్తోందని చెప్పింది. కారును ఆపాలని కోరినా, డ్రైవర్ ఆపకుండా పోతుంటే, స్టీరింగ్ ను గట్టిగా పట్టుకోవడంతో, డ్రైవర్ బ్రేకులు వేశాడు.

ఆ వెంటనే వాహనాన్ని దిగిన ఆమె, వాహనంలోని భర్త, ఇతరులకు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే చంబల్ నదిలో దూకేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పెళ్లయిన తరువాత కూడా ఆమె బాగానే ఉందని, ఇంతలోనే ఏమైందో తమకు అర్థం కావడం లేదని వధువు తండ్రి వాపోయాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

More Telugu News