Cricket: శ్రీలంక క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం... ముగ్గురు మాజీ క్రికెటర్లపై ఐసీసీ విచారణ

  • తమ క్రికెటర్లపై ఆరోపణలు వచ్చాయన్న లంక క్రీడల మంత్రి
  • వారిలో ప్రస్తుత జట్టు ఆటగాళ్లు లేరన్న లంక బోర్డు
  • పేర్లు వెల్లడించని లంక మంత్రి
ICC probes on threee Sri Lankan cricketers

గత కొన్ని దశాబ్దాలుగా క్రికెట్ ను ఫిక్సింగ్ భూతం వెంటాడుతోంది. తాజాగా శ్రీలంక క్రికెట్లో ఫిక్సింగ్ కలకలం రేగింది. ముగ్గురు క్రికెటర్లపై ఐసీసీ విచారణ షురూ చేసింది. ఈ విషయంలో లంక క్రీడల మంత్రి దుల్లాస్ అలహపెరుమ స్పందిస్తూ, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ముగ్గురు క్రికెటర్లు ఐసీసీ విచారణ ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనిపై శ్రీలంక బోర్డు వివరణ ఇస్తూ, ఆ ముగ్గురిలో ప్రస్తుత జాతీయ జట్టుకు ఆడుతున్న వారెవరూ లేరని, విచారణ ఎదుర్కొంటున్నది మాజీ ఆటగాళ్లని స్పష్టం చేసింది. కాగా, ఆ ముగ్గురు క్రికెటర్లు ఎవరన్నది లంక క్రీడల మంత్రి వెల్లడించలేదు.

More Telugu News