Narendra Modi: మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

  • న్యూఢిల్లీలోని లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో భేటీ
  • కరోనా వైరస్ వ్యాప్తిపై చర్చ
  • ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం
Prime Minister Narendra Modi chaired Union Cabinet meeting today

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. న్యూఢిల్లీలోని లోక్‌ కల్యాణ్ మార్గ్‌లో జరుగుతోన్న ఈ భేటీలో కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చిస్తున్నారు.

లాక్‌డౌన్ తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటించింది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ అంశాలతో పాటు లడఖ్‌లో చైనాతో ఏర్పడిన పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

More Telugu News