Vijayawada: విజయవాడలో కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసుకుంటూ రెచ్చిపోయిన విద్యార్థులు

  • పటమటలో రెండు గ్రూపుల మధ్య వివాదం 
  • మాజీ రౌడీషీటర్‌ జోక్యం చేసుకున్నట్లు సమాచారం
  • రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం?
  • కొందరు విద్యార్థులకు గాయాలు
ruckus in vijayawada

విజయవాడలో రెండు గ్రూపుల విద్యార్థులు హల్‌చల్‌ చేశారు. పరస్పరం కత్తులు, రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం కలకలం రేపింది. పటమటలో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో వారంతా ఒక్క చోట చేరి కొట్టుకున్నారు. అయితే, ఇందులో మాజీ రౌడీషీటర్‌ జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది.

ఈ  దాడి ఘటనలో రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. పటమటలో వారంతా దాడులకు తెగబడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడిలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని  చికిత్స కోసం  ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు.

More Telugu News