Madhya Pradesh: పోలీసు చేసిన సాహసం వైరల్... మందలించి జరిమానా వేసిన ఎస్పీ!

  • సినీ పక్కీలో ఎస్ఐ స్టంట్
  • రెండు కార్లపై రెండు కాళ్లతో విన్యాసాలు
  • రూ. 5 వేల జరిమానా, మందలింపు
Police stuns with Stunt on two cars

మధ్యప్రదేశ్ లోని దామోహ్ ప్రాంతంలో రెండు కార్లపై నిలబడి సినీ పక్కీలో స్టంట్ చేసిన ఓ ఎస్ఐ వీడియో వైరల్ కావడంతో, ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. వివరాల్లోకి వెళితే, జిల్లా పరిధిలోని నార్సింగ్ గర్డ్ ఎస్ఐ మనోజ్ యాదవ్, ఇటీవల అక్షయ్ కుమార్ 'సింగం' సినిమాలోని ఓ స్టంట్ ను అనుకరించాడు. రెండు కార్లపై రెండు కాళ్లను పెట్టి అతను నిలబడగా, కార్లు కదిలాయి.

ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కావడంతో, అతని ప్రాణాంతక చర్యలపై విమర్శలు వచ్చాయి. దీంతో జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. మనోజ్ కుమార్ పై రూ. 5 వేల జరిమానా విధించామని అన్నారు. యువతపై చెడు ప్రభావాన్ని చూపే ఇటువంటి పనులు మరోసారి చేయవద్దని మందలించామని ఆయన తెలిపారు. మనోజ్ యాదవ్ చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News