మంత్రగత్తెలుగా అనుమానించి ముగ్గురు మహిళలపై దాష్టీకం!
- బిహార్, ముజఫర్పూర్లోని దక్రామా గ్రామంలో ఘటన
- మంత్రగత్తెలుగా అనుమానం
- ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలు
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
దక్రామా గ్రామంలో ముగ్గురు మంత్రగత్తె లు తమకు సమస్యలు సృష్టిస్తున్నారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. వారికి బుద్ధి చెబుతామంటూ అంతా ఆ ముగ్గురు మహిళల వద్దకు వచ్చి వారిని నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి, అర్ధనగ్నంగా వీధుల్లో తిప్పారు. ఆ సమయంలో వారిని అంతా కలిసి కొట్టడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు నేరపూరిత చర్యకు పాల్పడ్డారని, విచారణ జరిపి నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.