కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నందుకు.. వైద్య సిబ్బంది, పోలీసులపై రాళ్లతో దాడి
- మధ్యప్రదేశ్లోని షోపూర్ జిల్లాలో ఘటన
- ఇండోర్ నుంచి గ్రామానికి చేరుకున్న యువకుడు
- యువకుడి కుటుంబ సభ్యుల దాడిలో ఎస్సై తలకు తీవ్ర గాయం
దీంతో వైద్యాధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు గోపాల్ ఇంటికి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోని గోపాల్ కుటుంబ సభ్యులు పోలీసులపైనా రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు పోలీసులు, వైద్య సిబ్బందికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీరాం అవస్థి(52) తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడిచేసిన గోపాల్ కుటుంబంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.