Afghanistan: ‘థ్యాంక్యూ మై ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ మోదీకి ఆఫ్ఘన్ అధ్యక్షుడు ధన్యవాదాలు

  • భారత్ నుంచి ఆఫ్ఘన్ కు హైడ్రో క్లోరోక్విన్ , పారాసిటమాల్ టాబ్లెట్స్, గోధుమలు
  • ఈ సరుకు మాకు చేరుబోతోందన్న అష్రాఫ్ ఘనీ 
  • భారత్ కు, మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్
Afghanistan president thanks to PM Modi

భారత్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి ఆఫ్ఘనిస్థాన్ ధన్యవాదాలు తెలిపింది. ‘కరోనా’ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు హైడ్రో క్లోరో క్విన్ , పారాసిటమాల్ టాబ్లెట్స్, గోధుమలను ఇస్తున్నందుకు అక్కడి ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఓ ట్వీట్ చేశారు. ‘థ్యాంక్యూ మై ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ ప్రధాని మోదీని సంబోధిస్తూ ధన్యవాదాలు తెలిపారు. మొదటి విడత సరకు తమ దేశానికి, తమ ప్రజలకు ఒకట్రెండు రోజుల్లో చేరబోతోందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News