Anushka Shetty: 'నిశ్శబ్దం'లో వైవిధ్యం చూపించే షాలినీ పాండే!

  • అనుష్క చుట్టూ అల్లుకున్న కథ 
  •  సోనాలి పాత్రలో షాలినీ పాండే 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
Nishabdham Movie

అనుష్క తాజా చిత్రంగా 'నిశ్శబ్దం' రూపొందింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్ - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రధారి కాగా, ఇతర ముఖ్య పాత్రల్లో మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే కనిపించనున్నారు.

ఈ సినిమాలో అనుష్క స్నేహితురాలు 'సోనాలి' పాత్రలో షాలినీ పాండే కనిపించనుంది. ఆమె పాత్ర అనుమానాస్పదంగా ఉంటుందనీ, ఆమె పాత్రనే కథలో కీలకంగా నిలుస్తుందని తెలుస్తోంది. షాలినీ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయని అంటున్నారు. షాలినీ పాండేకి వైవిధ్యభరితమైన రోల్ పడిందనీ, నటన పరంగా ఇది తనని తాను నిరూపించుకునే పాత్ర అనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

More Telugu News