బలపరీక్షకు ముందు కమల్నాథ్ సర్కారుకు షాక్.. 16 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాకు స్పీకర్ ఆమోదం!
- ఈ-మెయిల్ ద్వారా అందిన రాజీనామాలను ఆమోదించిన స్పీకర్
- నేటి సాయంత్రంలోగా బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీం ఆదేశం
- బీజేపీ బలం 107.. 104కు పడిపోయిన కాంగ్రెస్ బలం
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో ఆ పార్టీ బలం ఇప్పుడు 104కు పడిపోయింది. అదే సమయంలో బీజేపీ బలం 107గా ఉండడంతో మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మార్గం సుగమమైంది. మరోవైపు నేటి సాయంత్రం 5 గంటల లోపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ స్పీకర్ ప్రజాపతిని సుప్రీంకోర్టు ఆదేశించింది.