Tirumala: తిరుమలలో తీవ్ర అస్వస్థతకు గురైన భక్తుడు... కరోనా భయం!

Maharashtra pilgrim hospitalized in Tirumala
షార్ట్స్‌లో చూడండి
దేశంలో ప్రతిచోటా కరోనా మహమ్మారి గురించి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఈ ప్రాణాంతక వైరస్ క్రమంగా అనేక ప్రాంతాలకు విస్తరిస్తుండడమే అందుకు కారణం. దేశవ్యాప్తంగా అనేక పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కలకలం కనిపిస్తోంది. తాజాగా, తిరుమల క్షేత్రంలోనూ కరోనా ఆందోళనలు రేగాయి.

శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మహారాష్ట్రకు చెందిన ఆ భక్తుడు వారణాసిని సందర్శించిన అనంతరం తిరుమల వచ్చాడు. ప్రస్తుతం అతడు తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఆ భక్తుడిని తిరుమలలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు, తిరుపతి అలిపిరి వద్ద చెక్ పోస్టును మూసివేసి, తిరుమలకు వాహనాలను నిషేధించినట్టు తెలుస్తోంది. చెక్ పోస్టు మూసివేతతో అలిపిరి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
Go Back to Shorts
Tirumala
Corona Virus
Maharashtra
Varanasi

More Telugu News