కరోనా కేసులు మహారాష్ట్రలోనే ఎక్కువ... ఏపీలో ఒక్కటే!
- దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 137
- మహారాష్ట్రలో 36 కేసులు నమోదు
- 24 కేసులతో రెండోస్థానంలో కేరళ
ఏపీ విషయానికొస్తే, కేవలం ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు ఉన్నట్టు వెల్లడైంది. తెలంగాణలో 3 కేసులు నమోదు కాగా, వారిలో ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాదులో ఒక మరణం సంభవించినా అది కర్ణాటక ఖాతాలోకి వెళ్లింది. కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడికి కరోనా సోకగా మెరుగైన చికిత్స కోసం అతని కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. మొత్తమ్మీద భారత్ లో 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే కరోనా ఉనికి వెల్లడైనట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.