Ranga Reddy District: రంగారెడ్డి జిల్లాలో బాంబు కలకలం... పేలుడుతో ఉలిక్కిపడిన స్థానికులు!

  • శివరాంపల్లి స్టేషన్‌ సమీపంలో ఘటన
  • ఆ చుట్టుపక్కల ఇళ్ల కిటికీల అద్దాలు ధ్వంసం
  • కెమికల్‌ డబ్బా కారణమన్న అభిప్రాయం
bomb blast in rangareddy district near sivarmpalli railway station

రంగారెడ్డి జిల్లాలో బాంబు పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాసేపు ఆందోళనకు కారణమయ్యింది. జిల్లాలోని శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈరోజు ఉదయం భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటన కారణంగా సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి.

ఊహించని ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమేకాక భయాందోళనలకు కారణమైంది. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఓ కెమికల్‌ డబ్బా కారణంగానే ఈ పేలుడు జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా నిర్థారించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More Telugu News