Chiranjeevi: కొరటాల మూవీలో చెర్రీ జోడీగా సమంత

  • 'రంగస్థలం'తో అలరించిన చరణ్ - సమంత 
  • మరోసారి ఈ జోడీని సెట్ చేసిన కొరటాల 
  • ఆగస్టులో విడుదల చేసే అవకాశం
Samantha to romance Charan again

కొరటాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడనీ, ఆ పాత్ర నిడివి 30 నిమిషాలకి పైగా ఉంటుందని అంటున్నారు. ఆయన సరసన నాయిక పాత్ర కూడా ఉంటుందనీ, ఆ పాత్ర కోసం అన్వేషణ సాగుతుందని చెప్పారు.

చరణ్ జోడీగా సమంతను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. 'రంగస్థలం' సినిమాతో చరణ్ - సమంత జంటకు మంచి క్రేజ్ పెరిగింది. అభిమానులంతా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేశారు. అందువల్లనే చరణ్ సరసన సమంతను కొరటాల ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఇక చిరంజీవి సరసన నాయికగా త్రిష కనిపించనున్న సంగతి తెలిసిందే. త్వరలో మొదలయ్యే రాజమండ్రి షెడ్యూల్లో ఆమె జాయిన్ కానుందని అంటున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News