AIIB: సీఎం జగన్ కు ప్రశంసలు... ఏపీకి రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఏఐఐబీ

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి రుణం ఇచ్చేందుకు ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇవాళ అమరావతిలో ఏపీ సీఎం జగన్ తో ఏఐఐబీ ప్రతినిధులు సమావేశమయ్యారు. కొత్తగా 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఏఐఐబీ అంగీకరించింది. ఈ రుణాన్ని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఖర్చు చేసుకోవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థికసాయం చేస్తామని బ్యాంకు వెల్లడించింది. రోడ్లు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది.

ఈ సమావేశం సందర్భంగా ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను బ్యాంకు ప్రతినిధులకు వివరించారు.  నాడు-నేడు కార్యక్రమాన్ని బ్యాంకు ప్రతినిధులు నాలెడ్జ్ మీద పెట్టుబడులుగా ప్రశంసించారు. అంతేకాదు, ఏఐఐబీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా సీఎం జగన్ ను ఆహ్వానించారు. కొత్తగా 3 పోర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పగా, వాటిలో ఒక పోర్టుకు తాము ఆర్థికసాయం అందజేస్తామని బ్యాంకు ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాదు, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి కూడా సహకారం అందిస్తామని వెల్లడించారు.
Go Back to Shorts
AIIB
Jagan
Andhra Pradesh
loan
YSRCP
Amaravati

More Telugu News