ఒక దశలో ఓడిపోతున్నామని ముందే కోచ్ కు చెప్పేసిన కోహ్లీ!
- నిన్న హామిల్టన్ లో న్యూజిలాండ్ తో మ్యాచ్
- విలియమ్సన్ విజృంభణ చూసి ఓడిపోతామనుకున్న కోహ్లీ
- రోహిత్, షమీల మ్యాజిక్ గెలిపించిందని వ్యాఖ్య
ఒక దశలో మ్యాచ్ లో ఓడిపోక తప్పదని భావించిన కోహ్లీ, అదే విషయాన్ని కోచ్ కి చెప్పాడట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం కోహ్లీ, మీడియా సమావేశంలో గుర్తు చేసుకున్నాడు. ఓ దశలో మ్యాచ్ తమ చేతి నుంచి జారిపోయిందని, అయితే, కీలక సమయంలో అతను అవుట్ కావడం, ఆ వెంటనే షమీ బంతితో మ్యాజిక్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగిందని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
ఇక సూపర్ ఓవర్ లోనూ విలియమ్సన్ విజృంభించడంతో తాము ఒత్తిడిలోకి వెళ్లామని, అయితే, రోహిత్ శర్మ తన బ్యాటుతో జట్టును గెలిపించాడని కితాబిచ్చాడు. ఇక ఈ సీరీస్ ను 5-0 తేడాతో గెలిచేందుకు ప్రయత్నిస్తామని, ఇప్పటివరకూ న్యూజిలాండ్ లో ఆడని సైనీ, సుందర్ తదితరులకు అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు.