ముంబయి సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి

  • బోయిసర్ గ్రామ పరిధిలోని కొల్వాడేలో ఫ్యాక్టరీ
  • రా.7.20కి పేలుడు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • 15 కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుడు శబ్దం  
మహారాష్ట్ర రాజధాని ముంబయి సమీపంలో ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది మృతి చెందారు. ముంబయికి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న తారాపూర్ కెమికల్ జోన్ లో భాగమైన బోయిసర్ గ్రామ పరిధిలోని కొల్వాడేలో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ మేరకు వివరాలను  పోలీసులు వెల్లడించారు.

రాత్రి సుమారు 7.20 గంటలకు ఈ పేలుడు జరిగిందన్నారు. ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూ.. సహాయక చర్యలు చేపడుతున్నారు.
Go Back to Shorts
Mumbai
Fire Accident
Chemical Factory
Maharashtra

More Telugu News