అజిత్ పవార్ కు కీలక కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన మహారాష్ట్ర ఏసీబీ!

  • పదేళ్ల క్రితం నీటిపారుదల శాఖలో కుంభకోణం
  • ఆధారాలు లభించలేదు
  • కోర్టుకు 16 పేజీల అఫిడవిట్
పదేళ్ల క్రితం మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన నీటి పారుదల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఊరట లభించింది. మహారాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ఈ కేసులో అజిత్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.

ఈ మేరకు నవంబర్ 27 నాటి తేదీతో బాంబే హైకోర్టుకు ఏసీబీ సూపరింటెండెంట్ రష్మీ నందేద్కర్ పేరిట 16 పేజీల అఫిడవిట్ అందింది. ఈ కేసులో అజిత్ పవార్ కు వ్యతిరేకంగా ఏ విధమైన ఆధారాలు లభించలేదని ఆమె తెలిపారు. ఆ సమయంలో అజిత్, విదర్భ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారని, నిధులను విడుదల చేయడంలో ఎటువంటి అవకతవకలూ జరగలేదని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Maharashtra
Ajit pawar
Clean Chit
ACB

More Telugu News