అమ్మలా చూసుకున్న అత్త.. కన్నీటితో పాడెను మోసిన నలుగురు కోడళ్లు!
- మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘటన
- వయోభారంతో కన్నుమూసిన సుందర్ బాయి
- తీవ్రంగా రోదించిన నలుగురు కోడళ్లు
ఆమె బతికిఉన్నంతవరకూ కోడళ్లను ఎంతో ప్రేమతో చూసుకుంది. దీంతో అత్త చనిపోగానే నలుగురు కోడళ్లు లతా, ఉషా, మనీషా, మీనా తట్టుకోలేకపోయారు. ఆమె భౌతికకాయంపై పడిపోయి గుండెలవిసేలా రోదించారు. కట్టుబాట్లను పక్కనపెట్టి ఆమె పాడెను మోశారు. అంతేకాకుండా అత్త సుందర్ బాయి చివరికోరిక ప్రకారం ఆమె కళ్లను దానం చేశారు.