Andhra Pradesh: మాలోకం, ఆయన టీమ్ ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు.. అప్పుడే క్షుద్రదాడి మొదలైంది!: విజయసాయిరెడ్డి

  • పేదలకు నాణ్యమైన బియ్యం అందించాలని జగన్ అనుకున్నారు
  • అందులో భాగంగానే శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించారు
  • దీన్ని మాలోకం, ఆయన టీమ్ తట్టుకోలేకపోతోంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేదలకు నాణ్యమైన బియ్యం అందించాలన్న ఆశయంతో శ్రీకాకుళం నుంచి పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే దీన్ని తట్టుకోలేని మాలోకం, ఆయన టీమ్ ఉన్మాదంతో రెచ్చిపోతున్నారని విమర్శించారు.

ఏపీ ప్రభుత్వం అందించిన సన్న బియ్యం బస్తాల్లో నీరు పోసి ‘గడ్డకట్టిన బియ్యం ఇస్తారా?’ అంటూ పచ్చదొంగలు క్షుద్రదాడిని మొదలుపెట్టారని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తంచేసిన విజయసాయిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం, నారా లోకేశ్ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Chandrababu
Jagan
YSRCP
Vijay Sai Reddy
Twitter
Rice

More Telugu News