అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లిన మోదీ
- విదేశీ పర్యటనను ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ
- జైట్లీ కుటుంబసభ్యులను ఓదార్చిన ప్రధాని
- మోదీ వెంట అమిత్ షా
మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే అరుణ్ జైట్లీ కన్నుమూశారు. వెంటనే ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మోదీ మాట్లాడారు. అయితే, విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని రావద్దని, పర్యటనను పూర్తి చేయాలని ఆ సందర్భంగా మోదీని జైట్లీ కుటుంబసభ్యులు కోరినట్టు వార్తలు వచ్చాయి. ఆదివారం జైట్లీ అంత్యక్రియలను నిర్వహించారు.