అమ్మను కొడతాడు...నన్ను చదువుకోనివ్వడు: తండ్రిపై పన్నెండేళ్ల బాలుడి ఫిర్యాదు
- నిక్కరు, బనీన్తో నేరుగా పోలీస్ స్టేషన్కు
- ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లి సమస్యలు ఏకరవు
- తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
వివరాల్లోకి వెళితే...మహరాష్ట్రలోని జలగామ్ జిల్లా జమనేర్కు చెందిన అజయ్ (12) తండ్రి భవన నిర్మాణ కార్మికుడు. తల్లి వ్యవసాయ కూలీ. అజయ్కి ఇద్దరు సోదరిలు. వారితో కలిసి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుకుంటున్నాడు. రోజూ పని నుంచి ఇంటికి వచ్చే తండ్రి రాత్రి చాలాసేపటి వరకు టీవీ చూస్తుండడం, తల్లిని ఎప్పటికప్పుడు కొడుతుండడంతో మనస్తాపానికి లోనయ్యాడు.
తన చదువుకు ఆటంకం కలగడం, తల్లి పడుతున్న వేదన భరించలేని చిన్నారి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తొలుత ఆశ్చర్యపోయిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాలుడికి చదువుపై ఉన్న శ్రద్ధను గుర్తించి అతని తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం అజయ్ని మార్కెట్కు తీసుకువెళ్లి దుస్తులు, చెప్పులు కొనిచ్చారు.