Andhra Pradesh: ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ
ఈ నెల 11 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎల్లుండి ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 12న వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కురసాల కన్నబాబు సభ ముందు ఉంచుతారు.