మహారాష్ట్రలో ఆనకట్టకు గండి ఘటనలో 14 మంది మృతి.. ఇంకా లభించని 9 మంది ఆచూకీ
- ఏడు గ్రామాలను ముంచెత్తిన వరదనీరు
- మృతదేహాలను తీసుకునేందుకు బాధిత కుటుంబ సభ్యుల నిరాకరణ
- మంత్రి హామీతో వెనక్కి తగ్గిన గ్రామస్థులు
వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బుధవారం రాత్రి వరకు చేపట్టిన గాలింపులో 14 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 9 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. పోటెత్తిన వరదనీరు కారణంగా రత్నగిరిలో 9 ఇళ్లు, రెండు బ్రిడ్జీలు ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు.
కాగా, మృతదేహాలను తీసుకునేందుకు బాధిత కుటుంబ సభ్యులు నిరాకరించారు. డ్యాం ప్రమాదకరంగా ఉందంటూ పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. అయితే, అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఆనకట్ట గండిపై విచారణకు ఆదేశిస్తామని మంత్రి గిరీశ్ మహాజన్ హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.