Andhra Pradesh: కోడెల శివప్రసాద్ ప్రారంభించిన బస్ షెల్టర్ ను ధ్వంసం చేసిన దుండగులు!

షార్ట్స్‌లో చూడండి
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం, కొత్తపల్లి గ్రామంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేరుతో ఉన్న బస్ షెల్టర్ ను గుర్తుతెలియని దుండగులు ఈరోజు ధ్వంసం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోడెల ప్రారంభించిన ఈ బస్ షెల్టర్, శిలాఫలకం, ఆర్చ్ లను దుండగులు ధ్వంసం చేశారు. బస్ షెల్టర్ ధ్వంసమైన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు  సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
kodela
bus shelter
destroyed

More Telugu News