జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లు లక్ష్యం ఇదే: అమిత్ షా
- ఏ ఒక్కరినో సంతృప్తి పరిచేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టలేదు
- సరిహద్దుల్లోని ప్రజల ప్రాణాలను కాపాడటం మాకు ముఖ్యం
- రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించాలి
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఏ ఒక్కరినో సంతృప్తి పరిచేందుకు తాము ఈ బిల్లును ప్రవేశపెట్టలేదని... అంతర్జాతీయ సరిహద్దుల వద్ద నివసిస్తున్న ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు ప్రవేశపెట్టామని చెప్పారు. జమ్ముకశ్మీర్లోని పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో బంకర్లను నిర్మించాలని రాజ్ నాథ్ సింగ్ హోం మంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయించామని... వాటి నిర్మాణాలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమని అన్నారు. జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పారు.