బీజేపీ కండువాలు కప్పుకున్న టీడీపీ ఎంపీలు

  • బీజేపీలో చేరిన సుజనా, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జేపీ నడ్డా
  • ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం
పొద్దుటి నుంచీ వార్తలొస్తున్నట్టుగానే, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లు ఆ పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లకు శాలువాలు కప్పి, పుష్ప గుచ్ఛాలను నడ్డా అందజేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
sujana
tg venkatesh
cm ramesh
bjp
delhi
nadda

More Telugu News