త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లు?
- అమిత్ షాతో నరసింహన్ భేటీ
- ప్రత్యేక గవర్నర్ల అంశంపై రెండుగంటల పాటు సుదీర్ఘ చర్చ
- త్వరలోనే తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతాయన్న నరసింహన్
రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా గవర్నర్ల నియామకంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అయితే, ఓ తెలుగు రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏపీనా, తెలంగాణనా అనేదానిపై స్పష్టతలేదు. అమిత్ షాతో భేటీ అనంతరం నరసింహన్ మాట్లాడుతూ, త్వరలోనే తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పూర్తిస్థాయిలో సమసిపోతాయని చెప్పారు. భవనాల కేటాయింపు సమస్యలాగా ఇతర సమస్యలు కూడా ఓ కొలిక్కివస్తాయని అన్నారు.