వారణాసిలో ప్రధాని మోదీ ఏం చేశారయ్యా అంటే..!: వివరించిన ప్రియాంక గాంధీ
- వారణాసిలో మోదీ 15 కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించారు
- కాశీలో ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఇదే
- మోదీ ఎప్పుడైనా ఓ పేదవాడి ఇంటికెళ్లడం మీరు చూశారా?
మోదీ ఇటీవల ఇంటర్వ్యూల ద్వారా టీవీల్లో కనిపిస్తున్నారని ఎద్దేవా చేసిన ప్రియాంక.. మోదీ లగ్జరీ గార్డెన్లలోనో, లేదంటే వారణాసి ఘాట్లలో గంగా హారతి చూస్తూనో కనిపిస్తుంటారని అన్నారు. మోదీ ఎప్పుడైనా ఓ పేదవాడి ఇంటికి వెళ్లడం చూశారా? అని ప్రశ్నించారు. దేశం ముందుకెళ్తోందని ఊదరగొడుతున్నారని, కానీ ఈ ఐదేళ్లలో మోదీ వారణాసిలో కేవలం 15 కిలోమీటర్ల మేర రోడ్షో మాత్రమే నిర్వహించారని విమర్శించారు. అది కూడా విమానాశ్రయం నుంచి నగరంలోకి మాత్రమేనని మండిపడ్డారు. వారణాసిలో ఈ ఒక్క అభివృద్ధి తప్ప మరేమీ కనిపించలేదని ప్రియాంక విరుచుకుపడ్డారు.