ఓటు హక్కును వినియోగించుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత!

  • హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఓటు
  • పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసిన భార్యాభర్తలు
  • అనంతరం కారులో తిరుగుప్రయాణం
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగచైతన్య, ఆయన భార్య సమంత అక్కినేని ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉన్న పోలింగ్ కేంద్రంలో వీరిద్దరూ ఓటు వేశారు. అనంతరం తమ భద్రతా సిబ్బందితో కలిసి అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలను మే 23న ప్రకటిస్తారు.
Go Back to Shorts
Andhra Pradesh
Assembly Election
Telangana
loksabha
akkineni
nagachaitanya
samantha
vote cast

More Telugu News