భార్య వివాహేతర సంబంధం.. చిన్నారులకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న భర్త

  • హాయిగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టిన భార్య
  • వదిలి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం
  • మానసిక క్షోభకు గురై ఆత్మహత్య
వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో కలత చెందిన ఓ అధ్యాపకుడు తన ఐదేళ్లలోపు చిన్నారులను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర సరిహద్దు పట్టణమైన బల్లార్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. రుషికాంత్ (40) ప్రైవేటు ఐటీఐలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు నారాయణి (5), కార్తిని (2)తో ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వీరి కుటుంబంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. వారం రోజుల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో రుషికాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరికి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.

పిల్లలు ఇద్దరినీ చున్నీతో ఉరివేసి చంపి ఆ ఫొటోలను భార్యకు వాట్సాప్ చేశాడు. అనంతరం ఇంటి పైకప్పుకు తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వాట్సాప్‌లో వచ్చిన ఫొటోలను చూసిన భార్య వెంటనే పోలీసులకు, తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అలాగే, ఇంటిపైనే ఉంటున్న రుషికాంత్ సోదరుడికి కూడా ఫోన్ చేసి విషయం చెప్పింది. అయితే, వారొచ్చేసరికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Maharashtra
Ballarpur
Suicide
extra marital affair

More Telugu News