‘మా’లో అవకతవకలు జరగడం వాస్తవం.. శివాజీరాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు: నరేశ్
- మమ్మల్ని వెనక్కి లాగుతున్నారు
- ఈనెల 23న ప్రమాణ స్వీకారం
- శివాజీ రాజా అడ్డుకుంటున్నారు
ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. ‘మా’లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవమని.. అయితే ‘మా’ గుట్టు బయటపడకుండా అందరినీ కలుపుకుపోయి పని చేయాలని తాను నిర్ణయించుకున్నట్టు నరేశ్ తెలిపారు. కానీ పని చేసుకోనీయకుండా తమను వెనక్కి లాగుతున్నారని వాపోయారు.
పరిశ్రమలోని పెద్దల సలహా మేరకు ఈ నెల 22న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించుకున్నామని తెలిపారు. కానీ శివాజీరాజా తన పదవీ కాలం 31 వరకూ ఉందని.. అప్పటి వరకూ ‘మా’ కుర్చీలో కూర్చోవడానికి వీల్లేదంటున్నారని నరేశ్ పేర్కొన్నారు. ఒకవేళ అలా కూర్చుంటే కోర్టుకు వెళతామని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వాపోయారు. తాము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అలా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. పెద్దలు ఎలా చెబితే అలా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నరేశ్ తెలిపారు.