పేలిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ...మూడో తరగతి విద్యార్థికి తీవ్రగాయాలు

  • దొరికిన బ్యాటరీని సంచిలో పెట్టుకున్న చిన్నారి
  • తరగతి గదిలో ఆడుకునేందుకు తీయగా ఘటన
  • ముఖానికి, చేతికి, ఛాతికి గాయాలు
ప్రమాదాన్ని ఊహించని ఓ చిన్నారి రోడ్డుపై దొరికిన ఓ సెల్‌ఫోన్‌ బ్యాటరీని ముచ్చటపడి దాచుకుంటే, అదే అతని ప్రాణాల మీదికి తెచ్చింది. ఎవరో వాడి బయట పడేసిన సెల్‌ఫోన్‌ బ్యాటరీ  తరగతిలో పేలి తీవ్రంగా గాయపడ్డాడు. తెలంగాణలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లి  ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హెచ్‌ఎం అందించిన వివరాలు ఇలావున్నాయి.

గ్రామానికి చెందిన మామిడాల శంకర్‌ కొడుకు రాజు ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చాడు. గణితం టీచర్‌ క్లాస్‌ జరుగుతోంది. ఆ సమయంలో రాజు తన పుస్తకాల సంచిలో భద్రపరిచిన సెల్‌ఫోన్‌ బ్యాటరీని బయటకు తీశాడు. దాంతో ఆడుకుంటుండగా ఉన్నట్టుండి అది పేలింది. ఈ హఠాత్పరిణామంతో ఒక్కసారిగా పాఠశాలలో కలకలం రేగింది.

ఏం జరిగిందో అర్థంకాక క్లాస్‌లో టీచర్‌ టెన్షన్‌ పడగా, పిల్లలు భయంతో ఓ మూలకు చేరిపోయారు. గమనిస్తే పేలుడు కారణంగా రాజు ముఖం, ఛాతి, చేతికి తీవ్రగాయాలై రక్తం మడుగులో కనిపించాడు. వెంటనే అతనికి ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం జనగామలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Go Back to Shorts
cellphone battery blast
janagama
8 year old boyinjured

More Telugu News