మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన రద్దు!
- ఈ నెల 17న అమెరికా వెళ్లాల్సిన లోకేశ్
- ప్రస్తుతం శ్రీకాకుళంలో పర్యటిస్తున్న మంత్రి
- తుపాను ప్రభావం నుంచి కోలుకునేంత వరకు అక్కడే
తిత్లీ తుపాను దెబ్బకు ఉత్తరాంధ్ర ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయింది. ప్రస్తుతం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటిస్తున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న గ్రామాలు పూర్తిగా కోలుకునే వరకు జిల్లాలోనే ఉండాలని మంత్రి నిర్ణయించారు. దీంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. మరో రెండు రోజులపాటు లోకేశ్ శ్రీకాకుళంలోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తారని అధికారులు తెలిపారు.