ఆసియా కప్.. రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • 7.6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు పతనం
  • శిఖర్ ధావన్ 15, రాయుడు 2 పరుగులు
  • 223 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 7.6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (15), రాయుడు 2 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ శర్మ, కార్తీక్ కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 31 పరుగులు చేయగా, కార్తీక్ 3 పరుగులు చేశారు. కాగా, భారత్ కు 223 పరుగుల విజయలక్ష్యాన్ని బంగ్లాదేశ్ నిర్దేశించింది. తొలుత  బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో ఆల్ అవుటై 222 పరుగులు చేసింది.
Go Back to Shorts
asia cup
india
dubai

More Telugu News