అమృత తండ్రి మారుతీరావు క్రూరమైన క్రిమినల్: రాంగోపాల్ వర్మ
- ప్రణయ్ ను హతమార్చడం అతనికి గౌరవమా?
- ఒకవేళ ఇది పరువు హత్య అయితే..
- మారుతీరావు కూడా చావడానికి సిద్ధంగా ఉండాలి
మిర్యాలగూడలో ఇటీవల జరిగిన పరువు హత్యపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. అమృత తండ్రి మారుతీరావు ఒక పిరికి, క్రూరమైన క్రిమినల్ అని, ప్రణయ్ ను హతమార్చడం అతనికి గౌరవమా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఇది పరువు హత్య అయితే, మారుతీరావు కూడా చావడానికి సిద్ధంగా ఉండాలని, పరువు కోసం హత్యలు చేసే వారిని హత్య చేయడమే నిజమైన పరువు హత్య అని వర్మ అభిప్రాయపడ్డారు.