kancharapalem: జగన్ బహిరంగ సభ.. భారీ ఎల్ ఈడీ స్క్రీన్ల ఏర్పాటు!
విశాఖపట్టణం శివార్లలోని కంచరపాలెంలో వైఎస్ జగన్ బహిరంగ సభకు ప్రజలు తరలి వచ్చారు. విశాఖ వాసులు జగన్ కు ఘనస్వాగతం పలికారు. జగన్ భారీ బహిరంగ సభ సందర్భంగా విశాఖ నగరంలో పలుచోట్ల భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విశాఖలోని వైఎంసీఏ, గోకుల్ పార్క్, సీఎంఆర్, సెంట్రల్ పార్క్, శివాజీ పార్క్, ఎన్ఏడీ జంక్షన్, గాజువాక జంక్షన్ లలో ఈ భారీ ఎల్ డీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.