చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోల మృతి

మావోయిస్టులకు మరోమారు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో గురువారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డు పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం నుంచి గాలింపు మొదలు పెట్టారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో తిమినార్‌, పూసనార్‌ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోలు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం కాల్పులకు దిగాయి. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మహిళలు సహా ఎనిమిదిమంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి రెండు ఇన్సాస్‌ రైఫిళ్లు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.
Go Back to Shorts
Police
Chhattisgarh
Encounter
Maoists

More Telugu News