వారికి ఉరే సరి... 'నిర్భయ' కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు!
- ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ దోషుల రివ్యూ పిటిషన్
- తోసిపుచ్చిన న్యాయస్థానం
- కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను సమర్థించిన సుప్రీంకోర్టు
కాగా, 2012 డిసెంబరు 16న జరిగిన నిర్భయ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అత్యాచారాలపై కఠిన చట్టాలను తేవడానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ కేసులో దోషులుగా తేలిన అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ గతంలో తీర్పు వెలువడింది. అయితే, తమకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ ఆ నలుగురిలో ముగ్గురు దోషులు రివ్యూ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది.