మొన్న మమతా బెనర్జీ, నిన్న దేవెగౌడ, రేపు నవీన్ పట్నాయక్... వేగం పెంచిన కేసీఆర్!
- ఇప్పటికే మమత, దేవెగౌడలతో చర్చలు
- తదుపరి నవీన్ పట్నాయక్ తో
- మే తొలివారంలో నేతల భేటీ!
మే తొలి వారంలో వీరిద్దరి కలయిక ఉంటుందని జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. జాతీయ స్థాయి కూటమిపై వీరి మధ్య చర్చలు జరగనున్నాయని తెలిపింది.
కాగా, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సైతం ఇటీవల తెలంగాణ వచ్చి, కేసీఆర్ తో మాట్లాడి వెళ్లారు. మరింతమంది ప్రాంతీయ పార్టీల నేతలను కలుసుకుని ప్రజా ఫ్రంట్ ఏర్పాటుపై సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలన్నది కేసీఆర్ అభిమతంగా తెలుస్తోంది.