నేను వేసింది తొలి అడుగే... ముందు ముందు మరిన్ని కఠిన నిర్ణయాలు: చంద్రబాబు
- వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదు
- ప్రస్తుతం ఎన్డీయేలో మాత్రం కొనసాగుతాం
- సానుకూల నిర్ణయాలు తీసుకుంటారన్న ఉద్దేశంతోనే
- ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు
సంయమనం పాటిస్తూ ప్రయోజనాలను సాధించుకోవాలన్నది తన అభిమతమని, కేంద్రంపై మరింత ఒత్తిడి పెడుతూనే, సానుకూల నిర్ణయాలు వెలువడితే కలిసుంటామని చెప్పడానికే ప్రస్తుతానికి ఎన్డీయేలో ఉండాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ఏం ప్రయోజనాలు ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాని కార్యాలయం చుట్టూ తిరుగుతోందో తనకు తెలుసునని, ఏ ఉద్దేశంతో వారు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారో వెల్లడించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డ ఆయన, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నిజాలే చూపించాలని కోరారు.